calender_icon.png 1 May, 2025 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కవులు సామాజిక చైతన్య పరిచే రచనలు చేయాలి

29-04-2025 12:00:00 AM

జిల్లా ఎస్పీ రావుల గిరిధర్

వనపర్తి టౌన్ ఏప్రిల్ 28: కవులు సమాజాన్ని  చైతన్య పరిచే రచనలు చేయాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. సోమవారం రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో వనపర్తికి చెందిన ప్రముఖ పద్య కవి ఆకుల శివరాజలింగం రచించిన కొన్ని పుస్తకాలు  జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ చదివి పరవశించి ఆనందంతో కవి గారిని శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సంద ర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ...

సాహిత్యం సమాజ హితాన్ని కోరుతుంది కాబట్టి కవులు సమాజాన్ని చైతన్య పరిచే రచనలు చేయాలని కోరారు. ఆకుల శివరాజలింగంను స్పూర్తిగా తీసుకొని వర్తమాన కవులు రచనలు చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో  స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్, ఉమామహేశ్వర భజన మండలి సభ్యులు, టి, వెంకట్ రాములు, వై, నగేష్ యాదవ్, నరేష్,  శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.