7 April, 2026 | 5:07 PM

Breaking News

ఎమ్మెల్యే విజయ రమణారావుకు నిలువెత్తు దండతో ఘనంగా సన్మానం   •   చంద్ర మహంకాళి ఆలయంలో పూజలు   •   గోపాల్పేట్ శ్రీ నల్లపోచమ్మ నూతన ఆలయ కమిటీ ఎన్నిక   •   పేదల స్వంతింటి కల కాంగ్రెస్‌తోనే సాకారం: ధరావత్ వీరన్న నాయక్   •   'టచ్ చేసి చూడు.. పాకిస్థాన్‌ ముక్కలే'! పాక్‌కు భారత్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌   •   గిరిజన గ్రామంలో పోలీసుల గ్రామోత్సవం నిర్వహణ   •   రసాయనాల నియంత్రణతో క్యాన్సర్ నివారణ   •   ఘనంగా జీవీఆర్ జన్మదిన వేడుకలు   •   పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా కేక్ కటింగ్   •   ఐఎన్టీయుసీ కాంట్రాక్ట్ యూనియన్ ఉపాధ్యక్షుడిగా ఎస్కే బాజీ సాహెబ్   •  

ములుగులో ఎన్‌కౌంటర్‌.. కొత్తగూడలో హై అలర్ట్

01-12-2024 01:20 PM

హైదరాబాద్: ములుగు జిల్లా ఏటూరునాగారం చల్పాక అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ దృష్ట్యా కొత్తగూడలో పోలీసులు హై అలర్ట్ అయ్యారు. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ గ్రేహౌండ్స్, యాంటీ మావోయిస్టు స్క్వాడ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. మరణించిన వారిలో మావోయిస్టు కీలక నాయకులు ఉన్నారని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో యెల్లందు- నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి కుర్సం మంగు అలియాస్ బద్రు (35), అగోళపు మల్లయ్య (43), ముస్సాకి దేవల్ (22), ముస్సాకి జమున (23), జైసింగ్ (25), కిషోర్ (22), కమేష్ (23) మృతి చెందారు. ఈ ఎన్ కౌంటర్ నుంచి కొందరు మావోయిస్టులు తప్పించుకున్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో చల్పాక అటవీ ప్రాంతంలో పోలీసులు కూబింగ్ నిర్వహిస్తున్నారు. కొందరు అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు. మహబూబాబాద్ ప్రధాన రహదారిపై పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు. శనివారం, సరిహద్దు భద్రతా దళానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా ఒడిశాలో మావోయిస్టు కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయని, నిషేధిత సంస్థలోని 60-70 మంది సభ్యులు మాత్రమే రాష్ట్రంలో చురుకుగా ఉన్నారని చెప్పారు.