7 April, 2026 | 3:22 PM

Breaking News

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన కోవ లక్ష్మి   •   ప్రజలు మధ్యవర్తులను నమ్మవద్దు   •   కన్నాలలో బాలామృతం కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ గుడిసె గట్టయ్య   •   కేంద్రం కీలక నిర్ణయం.. 5 కిలోల గ్యాస్‌ సిలిండర్ల సరఫరా పెంపు   •   నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: విద్యుత్ స్తంభాల ట్రాక్టర్ బోల్తా— ఇద్దరు మృతి   •   హైదరాబాద్‌లో కలకలం... కూకట్‌పల్లి JNTUకు బాంబు బెదిరింపు   •   పెద్దపల్లి నియోజకవర్గంలో రైతులే రాజులు   •   ఆన్ లైన్ పద్దతిలోనే జిల్లాలో ఇసుక రవాణా జరగాలి   •   మల ద్వారంలో పెట్టిన పైపు.. మృతి చెందిన యువకుడు!   •  

చెట్టును ఢీకొన్న కారు.. ఇద్దరు వైద్యులు, లాయర్ మృతి

01-12-2024 01:33 PM

కర్ణాటక: ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులో ఉన్న బళ్లారి జిల్లాలో ఆదివారం ఉదయం కారు చెట్టును ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, కారులో ఉన్న మరో వ్యక్తికి గాయాలైనట్లు వారు తెలిపారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం మీదుగా బళ్లారికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామున 4 గంటలకు డ్రైవర్‌ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. బళ్లారి జిల్లాలోని చెల్లగుర్కి గ్రామం- ఆంధ్రప్రదేశ్‌లోని విడపనకల్ గ్రామం మధ్య జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో ఇద్దరు వైద్యులు, ఒక లాయర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.