13-12-2025 12:00:00 AM
నిజామాబాదు డివిజన్ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ
నిజామాబాద్, డిసెంబర్ 12 (విజయ క్రాంతి): గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండవ విడత ఎన్నికలు నిజామాబాదు డివిజన్ పరిదిలో జరగనున్న సందర్భంగా పోలీసు బందోబస్తు ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, డిచిపల్లి సర్కిల్ కార్యాలయంలో సంబంధిత పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారూ శుక్రవారం నిర్వహించిన ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని తూచా తప్పకుండా పాటించాలని తెలియజేశారు.
ప్రధానంగా నిజామాబాదు డివిజన్ పరిధిలో గల సమస్యత్మకమైన, అతి సమస్యత్మక మైనటు వంటి పోలింగ్ స్టేషన్ లను గుర్తించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘట నలు చోటుచేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. ప్రతీ పోలింగ్ కేంద్రానికి నిర్దిష్ట దూరంలో మార్కింగ్ చేయించి , ప్రచారం , గుర్తులను ప్రదర్శించడం నివారించాలని అన్నారు.
అవసరాన్ని బట్టి స్ట్రైకింగ్ ఫోర్స్ సేవలను వినియోగించుకొని గుంపులను చెదర గొట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలను ప్రభావితం చేసే డబ్బు, మద్యం, మరే ఇతరములు అక్రమ రవాణా జరగడానికి విలులేకుండా అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ లను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. విలేజ్ పోలీసు అధికారుల ఆయా గ్రామలపై నిఘా ఉంచి, ముందస్తు సమాచారాన్ని సేకరించి, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేయాలని అధికారులకు తెలియజేసారు.
ఎన్నికల రోజు సిబ్బంది తెల్లవారుజామునే తమకు కేటాయించి నటువంటి పోలింగ్ బూతు యందు సక్రమమైన విధులు నిర్వహించాలని, ఎన్నికల తర్వాత ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొత్తము పూర్తి అయ్యేవరకు ఎవరు ఎలాంటి ప్రలోభాలకు గురి కావద్దని, ఎన్నికల నియమా వళిని తూ.చా తప్పకుండా పాటించే విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని విధినిర్వహణలో ఎలాంటి లోపాలు ఉన్న అట్టి సిబ్బందిపై తక్షణ చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సిపి సాయి చైతన్య హెచ్చరించారు.
ఈ సమావేశంలో నిజామాబాదు ఏ.సి.పి వెంకట్ రామ్ రెడ్డి , నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, నిజామాబాద్ నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐ సురేష్ , డిచ్పల్లి సీఐ వినోద్, ధర్పల్లి సిఐ శ్రీ బిక్షపతి, నిజామాబాద్ రూరల్ ఎస్హెచ్ఓ శ్రీనివాస్, డిచ్పల్లి ఎస్త్స్ర ఆసిఫ్ , జక్రాన్ పల్లి ఎస్త్స్ర మహేష్, ఇందల్వాయి ఎస్త్స్ర సందీప్, మాక్లూర్ ఎస్త్స్ర రాజశేఖర్, సిరికొండ ఎస్త్స్ర రామకృష్ణ, ధర్పల్లి ఎస్త్స్ర కళ్యాణి, ముగ్పాల్ ఎస్త్స్ర సుస్మిత తదితరులు హాజరయ్యారు.