calender_icon.png 24 June, 2025 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు

05-06-2025 01:11:18 AM

మోపాల్ మండలంలో బాలికపై అత్యాచారయత్నం 

నిజామాబాద్ జూన్ 4: (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అత్యాచారానికి పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది స్పందించిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.  మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. 

15 సంవత్సరాల బాలికపై 17 సంవత్సరాల బాలుడు మంగళవారం అర్ధరాత్రి అత్యాచారయత్నానికి పాల్పడుతుండగా బాలిక కేకలు వేయడంతో పక్కనే నిద్రిస్తున్న తల్లిదండ్రులు బంధువులు మేల్కొనడంతో  బాలుడు పారిపోయాడు. తల్లిదండ్రుల నుండి సమాచారం అందుకొని వెంటనే స్పందించి న మోపాల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాలికను వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన వాడిపై ఫోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు