05-06-2025 01:11:18 AM
మోపాల్ మండలంలో బాలికపై అత్యాచారయత్నం
నిజామాబాద్ జూన్ 4: (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అత్యాచారానికి పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది స్పందించిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
15 సంవత్సరాల బాలికపై 17 సంవత్సరాల బాలుడు మంగళవారం అర్ధరాత్రి అత్యాచారయత్నానికి పాల్పడుతుండగా బాలిక కేకలు వేయడంతో పక్కనే నిద్రిస్తున్న తల్లిదండ్రులు బంధువులు మేల్కొనడంతో బాలుడు పారిపోయాడు. తల్లిదండ్రుల నుండి సమాచారం అందుకొని వెంటనే స్పందించి న మోపాల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాలికను వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన వాడిపై ఫోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు