05-06-2025 01:11:31 AM
70 కేజీలు పీడీఎస్ రైస్ తక్కువ ఉండటం వల్ల కేసు నమోదు
కల్లూరు, జూన్ 4 (విజయక్రాంతి): మండల పరిధిలోని యర్రబోయినపల్లి గ్రామపంచాయతీలో రేషన్ షాప్ నెంబర్ 30 నందు రేషన్ బియ్యాన్ని అక్రమ పద్ధతిలో కొనుగోలు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు సివిల్ సప్లై డిప్యూటీ తాహశీల్దార్ సత్యనారాయణ, స్థానిక యస్ ఐ హరిత, టా స్క్ ఫోర్స్ ఏఎస్ఐ జి కృష్ణ, పోలీసు సిబ్బంది బుధవారం రేషన్ షాపును తనిఖీ చేయడం జరిగింది.
తనిఖీ అనంతరం అధికారులు మీడియాతో మాట్లాడుతూ రేషన్షాప్ స్టాక్లో 70 కేజీలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. జూన్ ౩న రాత్రి సుమారు 7 గంటల సమయంలో రేషన్ షాపులో అదనపు రేషన్ బియ్యం నిల్వ ఉంచారని సమాచారం అందడంతో స్థానిక యస్ఐడీ హరిత యర్ర బోయినపల్లి గ్రామానికి చేరుకుని సంబంధిత రేషన్ దుకాణాన్ని సీజ్ చేయడం జరిగింది.
జూన్ 4వ తేదీ బుధవారం సివిల్ సప్లై అధికారులు, ప్రజల సమక్షంలో దుకాణంలోని బియ్యాన్ని స్థానిక కూ లీల ద్వారా బయటకు తరలించి రికార్డు పరమైన నిల్వలను, ప్రస్తుతం ఉన్న స్టాక్ ను పరిశీలించగా 70 కేజీలు తక్కువగా ఉన్నట్లు తేలిందని తెలిపారు.నిల్వలో తక్కువ ఉన్నందుకు గాను కేసు నమోదు చేసినట్లు తెలిపారు.