27-05-2025 11:09:16 PM
గ్రేసి డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు..
అశ్వాపురం (విజయక్రాంతి): అశ్వాపురం మండల కేంద్రంలో గంజాయి నియంత్రణ చర్యల్లో భాగంగా మంగళవారం నార్కోటిక్ గ్రేసీ డాగ్ స్క్వాడ్(Narcotic Gracie Dog Squad) తో పోలీసులు ఆకస్మికంగా సోదాలు చేపట్టారు. గంజాయి సప్లై చేస్తున్నారనే సమాచారంతో ఈ తనిఖీలు చెప్పట్టినట్లు అశ్వాపురం ఎస్ఐ మధు ప్రసాద్(SI Madhu Prasad) పేర్కొన్నారు. ఆయన ఆధ్వర్యంలో చవిటిగూడెంలో అనుమానిత గంజాయి సేవించే వ్యక్తుల ఇండ్లను గంజాయి దాచిపెట్టేందుకు అవకాశం ఉన్న పొదలు పెరిగివున్న ఖాళీ స్థలలల్లో నార్కోటిక్ గ్రేసి డాగ్ స్క్వాడ్ తో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ... తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలని వారికి ఎప్పటికప్పుడు పలు అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రజల ప్రాణాలకు హాని చేసే గంజాయి లాంటి మత్తు పదార్థాలను నిర్మూలించడంలో ప్రజలు, యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. మండలంలో గంజాయి మూలాలను తొలగించడం కోసం అశ్వాపురం పోలీసులు పటిష్ఠంగా పనిచేస్తున్నామన్నారు. ఈ తనిఖీల్లో అశ్వాపురం పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.