calender_icon.png 8 November, 2025 | 9:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

08-11-2025 08:11:27 PM

జహీరాబాద్ టౌన్: పేకాట ఆడుతున్న 11 మంది పేకాట‌రాయుళ్ళ‌ను పోలీసులు అరెస్టు చేశారు. న‌మ్మ‌ద‌గిన స‌మాచారం మేర‌కు చిన్న హైదరాబాద్ గ్రామ శివారులోని పేకాట స్థావరంపై దాడి చేసి 11 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రూ.40,150 నగదు, 4 మోటార్ సైకిళ్లు, 14 సెల్‌ఫోన్లు,  52 పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్నట్లు అందిన సమాచారం మేరకు ఎస్‌ఐ కె. వినయ్ కుమార్ సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు. పారిపోవడానికి ప్రయత్నించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.