30-06-2025 01:52:48 AM
ప్రైవేటు స్కూళ్లపై పర్యవేక్షణ కరువు
గంభీరావుపేట, జూన్ 29 (విజయ క్రాంతి): ప్రైవేట్ పాఠశాలల నియంత్రణపై అధికారుల లోపం కారణంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. అత్యధిక ఫీజులు వసూలు చేస్తూ, కనీస వసతులు లేకుండా విద్యను వ్యాపారంగా మలుచుకుంటున్న ప్రై వేట్ యాజమాన్యాలపై దోపిడిని అరికట్టడం లో విద్యాశాఖ అధికారుల నిర్లక్షం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. విద్యతో పాటు శారీరక అభివృద్ధికి అవసరమైన క్రీడా ప్రాంగణం లేని పాఠశాలలు జిల్లా వ్యాప్తంగా అధిక సం ఖ్యలో ఉన్నాయి.
ఫీజుల పరంగా భారం, వసతుల పరంగా విఫలం :
పిల్లల విద్య కోసం తల్లిదండ్రులు వేలల్లో ఖర్చు చేస్తుండగా, విద్యాసంస్థలు మాత్రం తగిన వసతులు కల్పించడంలో విఫలమవుతున్నాయి. చాలా ప్రైవేట్ పాఠశాలల్లో వి ద్యార్థుల కోసం క్రీడా మైదానం లేదు. చిన్న గది లేదా బేస్మెంట్లో చదువులు నడుస్తున్నా యి. శారీరక శిక్షణ, ఆటల పట్ల ఆసక్తి కలిగించే విధంగా మౌలిక సదుపాయాలు లేవు.
శారీరక వికాసానికి ఆటలు అత్యవసరం :పిల్లలలో ఆరోగ్యకరమైన అభివృద్ధికి ఆట లు కీలక పాత్ర పోషిస్తాయి. కానీ, కొంతమం ది యాజమాన్యాలు పిల్లలను కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం చేస్తూ, బయట గాలి కూడా తేలియనివ్వడం లేదు. ఇది విద్యార్థులపై మానసిక, శారీరక ఒత్తిడిని పెంచే పరి స్థితికి దారితీస్తోంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ పీరియడ్లు సమర్థవంతంగా నిర్వహించకపోవ డంతో పిల్లలు ఒత్తిడిలోకి వెళ్తున్నారు.
తల్లిదండ్రుల ఆవేదన :
‘ఫీజు వేలల్లో వసూలు చేస్తారు. కానీ పిల్ల లు ఆడుకునే స్థలం లేదు. ఆటల అవసరాన్ని పాఠశాల యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది,‘ అని ఓ తల్లిదండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల వాతావరణం చదువుతో పాటు పిల్లల అభివృద్ధికి సహకరించాలి. కా నీ ఇక్కడ క్లాస్రూమ్లోంచే బయటకు రావడానికి అవకాశముండడం లేదు, అని మరో తల్లి వాపోతున్నారు.
నిఘా వ్యవస్థల విఫలం :
ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు ప్రతి ఏడాది పాఠశాలలను పరిశీలించాల్సి ఉన్నా, అది పేరుకే పరిమితమవుతోంది. నిబంధన ల ప్రకారం, ప్రతి ప్రైవేట్ పాఠశాలలో క్రీడా ప్రాంగణం లేదా సమీపంలో ఫిజికల్ శిక్షణకు వేదిక ఉండాలి. కానీ, పలు ప్రైవేట్ పా ఠశాలలు వీటిని అందించకపోయినా, అనుమతులు మాత్రం అలాగే కొనసాగు తున్నాయి.
నిపుణుల హెచ్చరిక :
విద్యను సమగ్ర అభివృద్ధికి దోహదపడే విధంగా చూడకపోతే భవిష్యత్ తరం ఆరోగ్యంగా ఎదగదని విద్యా నిపుణులు హెచ్చరి స్తున్నారు. పాఠశాలలు పిల్లల చదువు మా త్రమే కాకుండా, వారి ఆరోగ్యం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వసతులు కల్పించాలి. క్రీడలతో పిల్లల్లో సమానోత్సాహం పెరుగుతుంది. వాటిని విస్మరించకూడదు, అని వి ద్యా నిపుణులు సూచిస్తున్నారు.
అధికారుల జోక్యం అవసరం :
ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు సీరియస్గా స్పందించి, ప్రతి స్కూల్లో మౌలిక వసతులపై సమగ్ర తనిఖీ చేపట్టాలి. వాస్తవికంగా క్రీడా మైదానాలు ఉన్నాయా? ఆటల కోసం వేరే ఏర్పాట్లు ఉన్నాయా? అన్న విషయాల్లో స్పష్టత రావాలి. లేకపోతే నిబంధ నలు ఉల్లంఘించిన పాఠశాలలపై అనుమతులు రద్దు చేయాలి.
మొత్తానికి...
విద్యార్థుల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా, కేవలం లాభాల కోసం విద్యను అమ్ముకునే స్కూళ్లపై అధికారులు కఠినంగా వ్యవహరించాల్సిన సమయం ఇది. వసతులు మూరెడు... ఫీజులు బారెడు అన్న సామెతను మరిపించే ఈ దుస్థితిని సమూలంగా మార్చకపోతే, దీని ప్రభావం భవిష్యత్తరాలకునష్టమే.