13 July, 2026 | 6:00 PM

నీట్-యూజీ కౌన్సెలింగ్ వాయిదా

06-07-2024 12:31 PM

న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (అండర్ గ్రాడ్యుయేట్) నీట్-యూజీ కౌన్సెలింగ్‌ను తదుపరి నోటీసు వచ్చేవరకు వాయిదా వేయబడింది. నీట్- యూజీ ఆల్-ఇండియా కోటా (ఎఐక్యూ) సీట్ కౌన్సెలింగ్, వాస్తవానికి జూలై 6న ప్రారంభం కావాల్సి ఉంది. అదే రోజు ప్రారంభం కావాల్సిన నీట్ యూజీ కౌన్సెలింగ్‌ను వాయిదా వేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. న్యాయమూర్తులు జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో పాటు సిజెఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు జూలై 8న నీట్- యుజి 2024 పిటిషన్‌లను పరిష్కరించనుంది. నీట్ పరీక్షలో పేపర్ లీక్ సహా అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.