06-06-2025 12:00:00 AM
రికార్డుల పరిశీలన, నిక్కచ్ఛిగా విధులు నిర్వహించాలని హితవు
నిజామాబాద్ జూన్ 5: (విజయ క్రాంతి): బక్రీద్ పండుగ నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని చెక్ పోస్ట్ ల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లను జిల్లా పోలీస్ శాఖ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం సమయంలో బోధన్ సబ్ డివిజన్ పరిధిలోని కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, చేరుకొని తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా చెక్ పోస్ట్ వద్ద గల సిబ్బంది నిర్వహిస్తున్న విధుల గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. అక్కడ గల రికార్డు లను క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిక్కచ్చిగా విధులు నిర్వహించాలని ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని అక్రమంగా పశువుల ను తరలించడం జరగకూడదని సిబ్బందికి సిపి సాయికి చైతన్య ఆదేశాలు ఇచ్చారు ,
ప్రతీ వాహనానికి గల కాగితాలు తనిఖీ నిర్వహించాలని తెలియజేశారు అనంతరం వాహనాలను సిపి స్వయంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ ఎ.సి.పి శ్రీ శ్రీనివాస్, రుద్రూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ కృష్ణ , కోటగిరి పిఎస్ ఎస్ఐ శ్రీ సునీల్ మరియు చెక్ పోస్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు