calender_icon.png 8 June, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా సాధికారతే లక్ష్యం

06-06-2025 12:00:00 AM

హనుమకొండ, జూన్ 5 (విజయ క్రాంతి): మహిళా సాధికారత కోసం సీఎం రేవంత్ రెడ్డి, ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. గురువారం రోజున 61 వ డివిజన్ పరిధిలోని సిద్ధార్థ నగర్ లో రూ.22.60 లక్షలతో నిర్మించిన రాణి రుద్రమ దేవి మహిళా భవన్ ని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ అందరూ ఐకమత్యంతో అనతికాలంలోనే మహిళా భవనాన్ని నిర్మించి ఆదర్శంగా నిలిచారన్నారు. ప్రతి కాలనీలో కూడా అభివృద్ధి పై ప్రతినిధులకు కాలనీ వాసులు సహకరిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ప్రతి కాలనీలలో కాలనీ అభివృద్ధి కమిటీలు అవసరమని పేర్కొన్నారు. గతంలో 50 లక్షలు పై చిలుకు నిధులు రాని 61 వ డివిజన్ కి దాదాపు 3 కోట్ల పై నిధులు కేటాయించి సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ నిర్మాణాలు చేపట్టామని గుర్తు చేశారు.

అర్ధాంతంగా నిలిచిపోయిన కాజీపేట బ్రిడ్జి పునర్నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లి 14 కోట్ల నిధులను మంజూరు చేసి పనులను ప్రారంభిం చామని అన్నారు.  డివిజన్లలో సిబ్బంది కొరత ఉందని స్థానికులు కోరగా ఇటీవలే కౌన్సిల్ లో తీర్మానం చేసి పంపామని రానున్న వర్షాకాలం నాటికి సరిపడా సిబ్బందిని నియమిస్తామని హామీ ఇచ్చారు. తమ కాలనీలో అభివృద్ధి కోసం కృషి చేసిన సందర్భంగా కాలనీ పెద్దలు, అభివృద్ధి కమిటీ సభ్యులు ఎమ్మెల్యేని శాలువతో సత్కరించి, కృతజ్ఞతలు తెలియజేశారు.