20 March, 2026 | 9:23 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

నిలిచిన విద్యుత్ సరఫరా

28-04-2025 11:39 PM

స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్‌లో సమస్య..

ఆగిపోయిన రైల్వే, విమానాశ్రయ సేవలు..

పారిస్: యురోపియన్ విద్యుత్ గ్రిడ్‌లో సమస్య ఉత్పన్నం కావడంతో సోమవారం పలు యురోపియన్ దేశాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. స్పెయిన్, పోర్చుగల్‌తో పాటు ఫ్రాన్స్‌లోని వివిధ ప్రాంతాల్లో కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ అంతరాయం వల్ల పలు ప్రాంతాల్లో విమానాలు ఆలస్యం అయ్యాయి. ట్రాఫిక్ సమస్య తలెత్తింది. రైల్వేలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సమస్యపై స్పెయిన్ ప్రధాని కార్యాలయం స్పందించింది. ‘సమస్యను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని పేర్కొంది. యురోపియన్ విద్యుత్ గ్రిడ్‌లో సమస్య ఉత్పన్నం కావడమే ఈ సమస్యకు కారణంగా తెలుస్తోంది. విద్యుత్ అంతరాయ సమస్యతో స్పెయిన్, పోర్చుగల్ దేశాలు అత్యవసర క్యాబినెట్ భేటీ నిర్వహించాయి. విద్యుత్ సమస్యతో మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీని కూడా రద్దు చేశారు.