16 April, 2026 | 10:32 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు

03-04-2025 11:02 PM

బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ పట్టణంలోని బిజెపి నాయకులు హైదరాబాద్ వెళుతున్నారన్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సియు) 400 ఎకరాల భూమి వేలం వెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వము ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని తిరిగి ఆ భూమిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అప్పగించాలని నిన్న ఏబీవీపీ ఆధ్వర్యంలో సెంట్రల్ యూనివర్సిటీ భూమిని కాపాడాలని కోరుతూ శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తూ నిరసన తెలియజేస్తున్న విద్యార్థి సంఘ నాయకులపైన ఇష్టం వచ్చినట్లు లార్డ్ ఛార్జ్ చేయడం సిగ్గుచేటని రాష్ట్ర ప్రభుత్వం 400 ఎకరాల భూమిని తిరిగి సెంట్రల్ యూనివర్సిటీ అప్పగించాలని విద్యార్థుల పైన లాఠీచార్జి చేసిన  పోలీసులపైన చర్యలు తీసుకోవాలని, యూనివర్సిటీలో ఉద్యమాలు చేస్తున్న విద్యార్థి సంఘ నాయకులకు ప్రొఫెసర్లకు వారికి మద్దతు తెలపడానికి హైదరాబాద్ వెళుతున్నారని తెలుసుకొని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ గుడుగుడ్ల శ్రీనివాస్ మాజీ అసెంబ్లీ కన్వీనర్ సాయిలు పట్టణ అధ్యక్షులు ప్రసాద్ బిజెపి సీనియర్ నాయకులు కొనాల గంగారెడ్డి కొండని గంగారం శంకర్ లను అరెస్టు చేయడం జరిగింది.