30 May, 2026 | 9:51 PM

Breaking News

అచ్చంపేట గ్రామానికి ప్రీ ప్రైమరీ పాఠశాల మంజూరు   •   ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గ్రామాల్లో రోడ్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు   •   వరద సహాయక కార్యక్రమాల్లో విశేష సేవలందించిన యూఎస్‌టీ సంస్థకు జిల్లా కలెక్టర్ ప్రశంస   •   రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి   •   ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు దీక్ష   •   విత్తనాల కొనుగోలులో రశీదు తప్పనిసరి   •   పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత   •   రికార్డు స్థాయిలో పంట కొనుగోలు   •   బిఆర్ఎస్ కార్యకర్త రెండు కాళ్లు కోల్పోవడంతో పరామర్శించిన మాజీ మంత్రి,మాజీ ఎమ్మెల్యేలు   •   బాలికల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందాలి   •  

అచ్చంపేట గ్రామానికి ప్రీ ప్రైమరీ పాఠశాల మంజూరు

30-05-2026 09:51 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): ప్రభుత్వ ప్రాథమిక విద్యాభివృద్ధిలో భాగంగా నిజాంసాగర్ మండలంలోని ఎంపీపీఎస్ అచంపేట్ పాఠశాలకు ప్రీ ప్రైమరీ పాఠశాల మంజూరైనట్లు మండల విద్యాశాఖ అధికారి వై.తిరుపతి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చిన్నారులకు నాణ్యమైన ప్రాథమిక విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. ప్రీ ప్రైమరీ తరగతుల ద్వారా విద్యార్థుల్లో పాఠశాల పట్ల ఆసక్తి పెంపొందడంతో పాటు వారి మానసిక, సామాజిక, భాషా నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు, బోధన-అభ్యాస సామగ్రి మరియు ప్రత్యేక తరగతి గదుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఆయన కోరారు.