14-06-2025 12:47:00 AM
ఎన్నో రకాల సినిమాలు చేస్తూ టాలీవుడ్ కింగ్గా అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు అక్కినేని నాగార్జున. విభిన్న పాత్రల్లో మెపిస్తూ ‘మన్మథుడి’గా అమ్మాయిల మనసు దోచుకున్నారు. ప్రస్తుతం నాగార్జున రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అందులో ఒకటి శేఖర్ కమ్ముల ‘కుబేర’ కాగా, రెండోది రజనీకాంత్ ‘కూలి’.
ఈ రెండు సినిమాల్లోనూ ఆయన ప్రత్యేక పాత్రలే పోషిస్తుండటం విశేషం. దానికి కారణాలు లేకపోలేదు. ధనుష్ హీరోగా నటిస్తున్న ‘కుబేర’లో ప్రత్యేక పాత్ర చేయడానికి కారణం శేఖర్ కమ్ముల. ఆయన టేకింగ్ అంటే నాగ్కు ప్రత్యేకమైన అభిమానం. అలాగే పాత్రలోని కొత్తదనం నచ్చడంతో ‘కుబేర’నున ఓకే చేశారాయన. ఇందు లో ఆయన మిలియనీర్గా కనిపించబోతున్నారు. ఓ అతి పేదవాడికి, ఓ కోటీశ్వరుడికీ మధ్య జరిగే పోరాటంగా ఈ సినిమా ఉండబోతున్నది. ఈ సినిమా జూన్ 20న విడుదల కానుంది.
ఇక ‘కూలీ’ విషయానికొస్తే.. ఈ సినిమాను కేవలం రజనీకాంత్పై ఉన్న అభిమానంతో చేస్తున్నారు నాగార్జున. ఇందులో నాగ్ పాత్ర అత్యంత శక్తిమంతంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత నాగార్జున సోలోగా తన 100వ చిత్రాన్ని పట్టాలెక్కిస్తారని సమాచారం. ఈ సినిమాకు పా కార్తీక్ దర్శకత్వం వహిస్తారట. మరో విషయం ఏంటంటే.. ఈ సినిమాకి ‘కింగ్ 100’ అనే టైటిల్ను కూడా ఖరారు చేశారని తెలుస్తోంది. తన కెరీర్లోనే భారీ హిట్గా నిలిచేలా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారని.. నాగార్జున పుట్టిన రోజు (ఆగస్టు 29)న ఈ ప్రాజెక్టు అప్డేట్ ఇస్తారని సమాచారం.