10-06-2025 10:25:04 PM
పాపన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్లను సద్వినియోగం చేసుకోవాలని ఇందిరమ్మ కమిటీ సభ్యులు సూచించారు. ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి మంజూరు పత్రాలను మండల వ్యాప్తంగా మండలంలోని ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీ సభ్యులతో పాటు పంచాయతీ కార్యదర్శులు మంగళవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మాత్రమే నిర్మాణం చేపట్టాలన్నారు.