10-06-2025 10:26:49 PM
పాపన్నపేట: పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల దేవస్థానం నందు మంగళవారం నాడు పౌర్ణమిని పురస్కరించుకొని అమ్మవారికి పల్లకి సేవ నిర్వహించారు. వన దుర్గామాత ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ప్రతిష్టించి దేవస్థానం పుర:వీధులలో ఊరేగించారు. ఈ సందర్భంగా దేవస్థానం పరిసరాలు వన దుర్గామాత నామస్మరణతో మారుమ్రోగాయి. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యాలయ సిబ్బంది, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.