19 May, 2026 | 2:48 AM

ఐకేపీ సెంటర్ నిర్వాహకులపై ఒత్తిళ్లు

19-05-2026 01:30 AM

బెజ్జంకి, మే 18 : దళిత సామాజిక వర్గానికి చెందినవారమనే కారణంతో కులవివక్ష చూపిస్తూ ఐకేపీ సెంటర్ను మూసివేయాలని బెదిరింపులు వస్తున్నాయని ఐకేపీ నిర్వాహకులు కన్నీటి పర్యంతమయ్యారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రజా సంఘాల నాయకులు సందర్శించి సమస్యలను తెలుసుకున్నారు. ఐకెపి నిర్వాహకులు మాట్లాడుతూ, కొంతమంది పెద్ద రైతులు తమ వడ్లు ముందుగా కొనుగోలు చేయాలని ఒత్తిడి తెస్తూ సీరియల్ విధానాన్ని పాటించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. మహిళా సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.

ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ రైతులు సమన్వయంతో సహకరించాలని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.  అధికారులు రైస్ మిల్లర్లతో, వాహన యజమానులతో చర్చించి వడ్ల కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఇకముందు ఎవరైనా నిర్వాహకులను కులవివక్షతో ఇబ్బందులకు గురి చేస్తే ప్రజా సంఘాల తరపున పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు స్వరో రాష్ట్ర నాయకులు బొర్ర సురేష్ కుమార్, బిఎస్పినాయకులు కొంపెల్లి పర్షరాములు, డి.ఎస్.పి నాయకులు లింగాల సురేష్, ఎమ్మార్పీఎస్‌మండల అధ్యక్షులు వడ్లూరి పర్షరాములు, చింతకింది పర్షరాములు, నాయకులు లింగాల బాబు తదితరులురైతులు పాల్గొన్నారు.