calender_icon.png 13 June, 2025 | 11:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆటో మీటర్ చార్జీలు పెంచడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా

12-06-2025 11:55:37 PM

ఎమ్యెల్యే కూనంనేని సాంబశివ రావు..

ముషీరాబాద్ (విజయక్రాంతి): ఆటో మీటర్ చార్జీలు, రవాణారంగ కార్మికులకు సంక్షేమ బోర్డుతో పాటు ఇతర పెండింగ్ లోఉన్న ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివ రావు(MLA Kunamneni Sambasiva Rao) తెలిపారు. జీహెచ్‌ఎంసీ, ఓఆర్‌ఆర్ పరిధిలో కొత్తగా ఆటో రిక్షా పర్మిట్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వ జిఓ జారీ చేసేందుకు కృషి చేసిన కూనంనేని సాంబశివ రావుకు హైదరాబాద్, హిమాయత్ నగర్ మఖ్డూమ్ భవన్ లో గురువారం తెలంగాణ రాష్ట్ర ఆటో రిక్షా డైవర్స్ యూనియన్స్ జేఏసీ నేతలు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్బంగా జేఏసీ కన్వీనర్ బి.వెంకటేశం మాట్లాడుతూ... ఆటో డ్రైవర్లు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యలు ఆటో మీటర్ చార్జీలు పెంచడం, ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు హామీ ఇచ్చిన రూ.12.000/- ఆర్థిక సహాయం, ఆటో రవాణా రంగ సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఓలా, ఊబర్, రాపిడోల నుండి డ్రైవర్లను రక్షించడానికి ప్రభుత్వమే ఒక యాప్ను రూపొందించడం వంటివి తక్షణమే పరిష్కరించడానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి తో చేర్చించి పరిష్కరానికి కృషి చేయాలనీ విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆటో రిక్షా డ్రైవర్ల సంఘాల జేఏసీ నేతలు సిహెచ్. జంగయ్య, ఎండి.ఒమర్ ఖాన్, ఎస్కె. లతీఫ్, ఏం.శ్రీనివాస్  (ఎఐటియుసి), వి.ప్రవీణ్, లింగం (టియుసిఐ), వి.మారయ్య, మహేష్ (బిఆర్టియు,) పి.శ్రీకాంత్, అజయ్బాబు (సిఐటియు), పి. యాదగిరి (టీఎన్టీయూసీ) తదితరులు పాల్గొన్నారు.