13-06-2025 12:00:00 AM
తెలంగాణ మున్నూరు కాపు సంఘం
ఖైరతాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వ విప్, ఎంఎల్ఏ ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవిని కల్పిస్తూ జనాభా దామాషా ప్రకారం నామినేటెడ్ పదవులలో తగిన ప్రాధాన్యతని ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర మున్నూరు కావు సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
ఈ మేరకు గురువారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంగం జగిత్యాల జిల్లా అధ్యక్షులు నత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి జల్లేపల్లి వెంకటేశ్వరరావు, సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బొప్ప దేవన్న తదితరులు మాట్లాడారు.. . రాష్ట్రంలో 40 లక్షల మందికిపైగా ఉన్న మున్నూరు కాపులంతా కాంగ్రె స్ పార్టీని అధికారం లోకి తెచ్చేందుకు కష్టపడ్డారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి విధేయులు గా ఉంటున్న మున్నూరుకాపు సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వకపోవడం బాధాకరమని తెలిపారు. ఈ విషయంపై గురు వారం ఉదయం టిపిసిసి అధ్యక్షులు మహే ష్ కుమార్ గౌడ్ను కలిసి తమ గోడును విన్నవించామని తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఆయన మున్నూరుకాపు సా మాజిక వర్గంపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టిపెట్టిందని, అధిష్టానం తగు న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నదని చెప్పారని తెలిపారు.
తమ డిమాండ్ల సాధనకు ఎఐసిసి అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేను, రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నట రాజ్ ను కలిసి విన్నవిస్తామని తెలిపారు. ఆది శ్రీనివాస్కు మంత్రి పదవి ఇవ్వని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా శాంతియుతంగా ఆం దోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. సనూవేశంలో మున్నూరుకాపు సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆకుల శ్రీనివాన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.