15 April, 2026 | 1:40 PM

Breaking News

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •  

దక్షిణాఫ్రికా పర్యటనలో ప్రధాని మోడీ

22-11-2025 08:49 AM

జోహన్నెస్‌బర్గ్‌లో జీ20 శిఖరాగ్ర సదస్సు.. హజరుకానున్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ దక్షిణాఫ్రికా పర్యటిస్తున్నారు. జీ-20 దేశాల సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ(Prime Minister Modi) జోహన్నెస్‌బర్గ్‌ వెళ్లారు. ప్రధానమంత్రి మోదీ శుక్రవారం దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన టెక్ వ్యవస్థాపకులు(Indian origin tech entrepreneurs), భారతీయ సమాజ సభ్యులతో సంభాషించారు. భారత్ లో వారి సంబంధాన్ని మరింతగా పెంచుకోవాలని పిలుపునిచ్చారు.. జోహన్నెస్‌బర్గ్‌లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తో మోదీ భేటీ అయ్యారు. రక్షణ, అణు ఇంధనం సహా పలు రంగాల్లో పరస్పర సహకారంపై నేతలు చర్చించారు. నాస్పర్ ఛైర్మన్ కూస్ బెక్కర్ తో ప్రధాని మోదీ విడిగా సమావేశం అయ్యారు. భారత్ డిజిటల్ పర్యావరణ వ్యవస్థలో పెట్టుబడుల విస్తరణపై మోదీ చర్చించారు.