17 April, 2026 | 3:17 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

దక్షిణాఫ్రికా పర్యటనలో ప్రధాని మోడీ

22-11-2025 08:49 AM

జోహన్నెస్‌బర్గ్‌లో జీ20 శిఖరాగ్ర సదస్సు.. హజరుకానున్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ దక్షిణాఫ్రికా పర్యటిస్తున్నారు. జీ-20 దేశాల సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ(Prime Minister Modi) జోహన్నెస్‌బర్గ్‌ వెళ్లారు. ప్రధానమంత్రి మోదీ శుక్రవారం దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన టెక్ వ్యవస్థాపకులు(Indian origin tech entrepreneurs), భారతీయ సమాజ సభ్యులతో సంభాషించారు. భారత్ లో వారి సంబంధాన్ని మరింతగా పెంచుకోవాలని పిలుపునిచ్చారు.. జోహన్నెస్‌బర్గ్‌లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తో మోదీ భేటీ అయ్యారు. రక్షణ, అణు ఇంధనం సహా పలు రంగాల్లో పరస్పర సహకారంపై నేతలు చర్చించారు. నాస్పర్ ఛైర్మన్ కూస్ బెక్కర్ తో ప్రధాని మోదీ విడిగా సమావేశం అయ్యారు. భారత్ డిజిటల్ పర్యావరణ వ్యవస్థలో పెట్టుబడుల విస్తరణపై మోదీ చర్చించారు.