30-05-2025 02:55:28 PM
మహబూబాబాద్, (విజయక్రాంతి): పంటలకు కనీస మద్దతు ధర(Minimum support price) పెంపును హర్షిస్తూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi ) చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ జై జవాన్, జై కిసాన్ నినాదాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుందని, అందులో భాగంగానే దేశ రక్షణ కోసం కృషి చేస్తూ, ప్రజలకు అన్నం పెట్టే రైతన్నకు అండదండగా ఉండేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తుందని చెప్పారు.
పంటల మద్దతు ధర పెంచడం వల్ల రైతులకు లాభం కలుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు ఉప్పునూతల రమేష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు పొదిల నరసింహారెడ్డి, జిల్లా కార్యదర్శి రామడుగు వెంకట చారి, మండల ప్రధాన కార్యదర్శులు బాగోదు నాగేశ్వర చారి బోనగిరి ఉపేందర్ బచ్చు లక్ష్మీనారాయణ, లెంకలపల్లి శ్రీనివాస్, మంగిశెట్టి నాగయ్య, వెంకట్ రెడ్డి, సంపత్ రెడ్డి, వీరభద్ర చారి, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.