30-05-2025 02:52:25 PM
హైదరాబాద్: టీఆర్ఎస్ గతంలో అనేక పార్టీలతో పొత్తు పెట్టుకుంది.. 2004లో కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకుందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(BJP MP Raghunandan Rao) శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. 2009లో మహా కూటమి పేరుతో పలు పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని గుర్తుచేశారు. 2014లో కాంగ్రెస్(Congress)లో విలీనం చేస్తామన్నది ఎవరు.. బీఆర్ఎస్(Bharat Rashtra Samithi)తో బీజేపీ ఎప్పుడైనా పొత్తు పెట్టుకుందా? అని రఘునందన్ ప్రశ్నించారు. మా పార్టీ ఎదుగుదలను ఆపాలని కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. చిట్ చాట్ లు ఏంది.. ధైర్యముంటే ప్రెస్ మీట్ లు పెట్టండని సవాల్ విసిరారు. తప్పుడు వార్తలు రాయిస్తున్నారని చెప్పడం ఎందుకు? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ తో బీజేపీ అధిష్ఠానం ఎప్పుడూ మాట్లాడలేదని వివరించారు.
లేనిపోని పంచాయితీలు ఎందుకు.. కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పండి.. చిట్ చాట్ ల పేరుతో మా పార్టీని వివాదంలోకి లాగవద్దని రఘునందన్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు(BRS MLC Kavitha) విజ్ఞప్తి చేశారు. మీ సొంత పంచాయితీలు మీరు తేల్చుకోండి.. మిమ్మల్ని లాగవద్దని కోరారు. పేరు, ఊరు, స్థలం చెప్పండి.. స్పష్టంగా మాట్లాడండి.. బీఆర్ఎస్ నేతలు అమెరికాలో ఏం చెబుతారని ఆయన ఎద్దేవా చేశారు. కవిత, కేటీఆర్కు ఎలాంటి బ్రాండ్ లేదన్న రఘునందన్ రావు కవిత చెల్లని రూపాయి అయిపోయారని విమర్శించారు. చెల్లని రూపాయికి బ్రాండింగ్ చేసే ప్రక్రియ జరుగుతోందని వివరించారు. కవిత జాగృతి పెట్టకముందు తెలంగాణలో బతుకమ్మ ఆడలేదా?.. అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగా బలపడుతుందని తెలిపారు. పార్టీల పొత్తులు, విలీనాలపై ఎలాంటి చర్చలు జరగలేదని, బీజేపీ కేడర్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని రఘునందన్ రావు ఆరోపించారు.