4 March, 2026 | 1:56 PM

ర్యాలీలకు ముందస్తు అనుమతి తీసుకోవాలి

30-11-2025 02:10 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ర్యాలీలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని బాన్సువాడ డీఎస్పీ విట్టల్ రెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం నిజాంసాగర్ మహమ్మద్ నగర్ మండలంలోని నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికలను సామరస పురకంగా జరుపుకోవడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని. ఎన్నికల నియమావళికి కట్టుబడి ప్రతి ఒక్కరు ఉండాలని ఆయన సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట బాన్సువాడ రూరల్ సీఐ తిరుపతయ్య నిజాంసాగర్ ఎస్సై శివకుమార్  వున్నారు.