30-06-2025 01:36:06 AM
గద్వాల అభివృద్ధి కోసమే ప్రభుత్వానికి మద్దతుగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
గద్వాల, జూన్ 29 ( విజయక్రాంతి ) : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకి 100 సంవత్సరాలు ఎలాంటి ఢోకా లేదని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.జిల్లా కు చెందిన ఓ మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు మాట్లాడుతూ జూరాల ప్రాజెక్టులో కూలిపోతాదని .
ఎక్కువ వాహనాలు తిరగడం వల్ల ప్రాజెక్టు కూలిపోతుందని ప్రజలకు భయాందోళన కల్పిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆది సరైన పద్ధతి కాదన్నారు. జూరాల ప్రాజెక్టులో కొంత సమస్యలు ఉన్న మాట వాస్తవమే కానీ ప్రాజెక్టు కూలిపోయేంత పరిస్థితి లేదని . సమస్య లేకపోయినా కూడా ప్రజలకు తప్పుడు మాటలు చెప్పి ప్రజలకు భయాందోళన కల్పించడం సరైన పద్ధతి కాదని సూచించారు.
గద్వాల నియోజకవర్గంలో నేను ఏ పార్టీ అని విమర్శిస్తున్నారని వారికి నేను సూటిగా సమాధానం చెప్తున్నానని నేను అభివృద్ధి పార్టీ గద్వాల అభివృద్ధి కోసమే అధికార పార్టీకి మద్దతు తెలపడం జరిగిందన్నారు.
ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, మాజీ ఎంపీపీ ప్రతాప్ గౌడ్, మాజీ జెడ్పిటిసి రాజశేఖర్, జిల్లా సీనియర్ నాయకులు జి.వేణుగోపాల్, మాజీ కౌన్సిలర్ శ్రీను ముదిరాజ్, నాయకులు గోవిందు, కురుమన్న ధర్మ నాయుడు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.