30-06-2025 01:34:30 AM
కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాయమాటలు ఎవరు నమ్మరు
విలేకరుల సమావేశంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ సి లక్ష్మారెడ్డి
మహబూబ్ నగర్ జూన్ 29;(విజయ క్రాంతి) : ఎవరు ఎన్ని కుట్రలు చేసినా బిఆర్ఎస్ పై ప్రజలు పెట్టుకున్న విశ్వాసాన్ని విడగొట్టలేరని మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని విలేకరుల సమావేశంలో మంత్రులు మాట్లాడారు. గతంలో పత్రిక కార్యాలయాలు..టీవీ ఛానళ్ల కార్యాలయాల మీద దాడులు చేశారని, వాటి గురించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం లేదన్నారు.
ఫోన్ ట్యాపింగ్ పేరు మీద కేటీఆర్, హరీష్ రావు ల మీద కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. విల్లే జడ్జిల లెక్కన కొందరు చాన్నాళ్ల వాళ్ళు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఛానళ్ల వాళ్ళ కుటుంబ సభ్యుల మీద అట్లనే ప్రచారం చేస్తే ఊరికే ఉంటారా..?!ఆడవాళ్ళ జోలికి పోకుండా ప్రసారం చేయాలన్నారు. సీట్ కాకుంటే కేంద్ర సంస్థలతో విచారణ చేసుకోవాలని సవాల్ విసిరారు. ఎవరు తప్పు చేయలేదు..
విచారణకు సిద్దమే అన్నారు. నాయకుల మీద అభిమానంతో నిరసన తెలిపారు.. దానిని తప్పుగా చూపిస్తున్నారు.. వ్యక్తుల మీద ఎవరు దాడులు చేయలేదన్నారు. ఆడవాళ్లను కించ పరుస్తూ.. కుటుంబ వ్యవహారాలను ప్రసారం చేయడం సరి కాదన్నారు. ఇదే విధమైన ప్రసారాలు చేస్తే పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేస్తారని పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో అధికారులందరిని విచారణ చేయాలి. చట్ట పరంగా చర్యలు తీసుకోవాలె తప్ప ఇలాంటి ప్రసారాలు చేయవద్దన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ శాసన సభ్యులు జైపాల్ యాదవ్, ఆలా వెంకటేశ్వర్ రెడ్డి, నరేందర్ రెడ్డి,ఏమ్మెల్సీ నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.