calender_icon.png 17 June, 2025 | 11:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్కాజిగిరి నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించాలి

17-06-2025 12:00:00 AM

జిహెచ్‌ఎంసి కమిషనర్‌కు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వినతి 

మేడ్చల్, జూన్ 16(విజయ క్రాంతి): మల్కాజ్గిరి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని జి హెచ్ ఎం సి కమిషనర్ ఆర్ వి కర్ణన్ కు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. మచ్చ బొల్లారం డివిజన్ రైల్వే బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో కొత్తబస్తీ రైల్వే టన్నెల్ నాలా వెడల్పు చేయాలని కోరారు. దీనికి సంబంధించిన హైడ్రాలిక్ రిపోర్ట్ అందజేశారు.

వెంకటాపురం డివిజన్లోని అశోక్ నగర్, మౌలాలి డివిజన్ లోని ప్రశాంత్ నగర్, వినాయక నగర్ డివిజన్ లోని దీన్ దయాల్ నగర్, ఈస్ట్ ఆనంద్ బాబు డివిజన్లోని వసంతపురి కాలనీ లలో ఉన్న వార్డు కార్యాలయాలను ప్రజలకు అందుబాటులోకి తేవాలని, నేరేడ్మిట్ డివిజన్ ఆర్కేపురం ఆర్ యు బి, ఆర్ ఓ బి నిర్మించాలని, సి ఆర్ ఎం పి రోడ్లు నిర్మించాలని, జంక్షన్లో డెవలప్ చేయాలని కోరారు.

అల్వాల్ లో ఫైర్ స్టేషన్, మల్కాజిగిరి ఆర్ కె నగర్ లో సబ్స్టేషన్ పనులు చేపట్టాలని, బండ చెరువు నుంచి వచ్చే వరదను ఆనంద్ బాగ్ నుంచి జే టి సి మీదుగా లాలాపేట వరకు, ఈస్ట్ ఆనంద్ బాగు డివిజన్ సత్య రెడ్డి నగర్ నుంచి అక్క డివిజన్ లక్ష్మీ నగర్ వరకు బాక్స్ డ్రైనేజీ నిర్మించాలని కోరారు. అల్వాల్ కొత్తచెరువు, మినీ ట్యాంక్ బండ్ సఫిల్గుడా మీద మహనీయుల విగ్రహా లు ఏర్పాటుచేయాలనికోరారు.