17-06-2025 12:00:00 AM
చేవెళ్ల , జూన్ 16 : మాలల హక్కుల సాధన కోసం అలుపెరుగని ఉద్యమం చేస్తామని మాల మాహానాడు జిల్లా అధ్యక్షుడు మహేష్ అన్నారు. పల్లె పల్లెకు మాలల చైతన్య యాత్ర కార్యక్రమంలో భాగంగా సోమవారం శంకర్పల్లిలో కరపత్రం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాల మాహానాడు జిల్లా అధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాలలపై పక్షపాత వైఖరిని వీడాలని, మాలలు రాజ్యాంగం ద్వారా పొందాల్సిన హక్కులను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వైపు మాలలపై దాడులు పెరుగుతున్నాయని, మరో వైపు విష ప్రచా రం జరుగుతుందన్నారు.వారికి కల్పించాల్సిన హక్కులను న్యాయబద్దంగా పొందడానికి ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు.
మాలలంతా ఐక్యమై పోరాటానికి సిద్ధం కావాలని కోరారు. కార్యక్ర మంలో సమతా సైనిక్దళ్ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ బౌద్ధ, మాల మహానాడు శంకర్ పల్లి మండల అధ్యక్షుడు ఎన్.వెంకటేష్, ఉపాధ్యక్షుడు ఎం.మల్లికార్జున, ఉపాధ్యాయులు రాములు, అశోక్, శంకర్, ఎం.నర్సింలు, బాలన్నపాల్గొన్నారు.