15-10-2025 07:00:21 PM
కుభీర్ (విజయక్రాంతి): కుభీర్ మండల కేంద్రంలోని స్థానిక ఉర్దూ హైస్కూల్లో టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఇంగ్లీష్ టీచర్ లేకపోవడం వల్ల వారికి పాఠశాల విద్యలో నష్టం జరుగుతుందని వారు పేర్కొన్నారు. దీన్ని పరిష్కరించేందుకు, ఎం.ఇ.ఓకి వినతి పత్రం సమర్పణ జరిగింది. ఈ కార్యక్రమంలో జావీద్ ఖాన్, అబ్దుల్ వహీద్, ఇతర స్థానికులు పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వీరి తరగతులకు తక్షణం ఇంగ్లీష్ టీచర్ నియామకం జరగాలని ప్రతిపాదించారు.