31-05-2025 12:00:00 AM
పలువురు సినీ ప్రముఖులు శుక్రవారం వైజాగ్లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. భేటీ అనంతరం నిర్మాత సీ కల్యాణ్ సమావేశం వివరాలను మీడియాకు తెలియజేశారు. సినిమా టికెట్లు, థియేటర్ల నిర్వహణ, సర్సంటేజీ అంశాలపై చర్చించినట్టు చెప్పారు. ‘డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతల సంఘాల్లోని సభ్యులతో కమిటీ ఏర్పాటుచేయాలనుకుంటున్నాం.
ఒక్కో సంఘం నుంచి 9 మంది చొప్పున 27 మందితో ఈ కమిటీ ఏర్పాటవుతుంది. కమిటీ సభ్యుల పేర్లు తొలుత ప్రభుత్వానికి తెలియజేస్తాం. కమిటీ వివరాలను సోమవారం మీడియాకు వెల్లడిస్తాం. ప్రతి నెలా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం ఉంటుంది’ అని తెలిపారు. సమావేశంలో పాల్గొన్నవారిలో నిర్మాతలు సుధాకర్రెడ్డి, స్రవంతి రవికిశోర్, సీ కల్యాణ్, భరత్భూషణ్ తదితరులు ఉన్నారు.