calender_icon.png 7 June, 2025 | 11:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలి

06-06-2025 11:05:20 PM

అనంతగిరి: ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం(Prof. Jayashankar Badi Bata Program)లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ(Telangana State Government) ఆదేశానుసారం అనంతగిరి మండల కేంద్రంలోని అనంతగిరి జడ్పిహెచ్ఎస్, ప్రాథమిక పాఠశాలలు అనంతగిరి మండల కేంద్రంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఇట్టి గ్రామసభలో ఎంపీడీవో రామచంద్ర రావు పంచాయత్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎస్.కె సలీమా, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు విప్పర్ల రమేష్, బీసీ కాలనీ అనంతగిరి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీరస్వామి అంగన్వాడి కార్యకర్తలు,సెల్ఫ్ హెల్త్ గ్రూప్స్, యూత్ మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో బడిఈడు పిల్లలు బడిలో చేర్పించాలని అదేవిధంగా డ్రాప్ అవుట్  పిల్లలును  గుర్తించి బడిలో చేర్పించి  విధిగా జాయిన్ చేయాలని జూన్ 12 నాటికి టెస్ట్ బుక్స్ వర్క్ బుక్స్ నోట్ బుక్స్ మరియు డ్రస్సులను పంపిణీ చేయాలని ఈ విధంగా ఎంపీడీవో గారు కోరడం జరిగింది మండలంలో అన్ని పాఠశాలలో పిల్లల సంఖ్య ను పెంచాలని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు మంచిగా పని చేయాలని మండలానికి  మంచి పేరు తీసుకురావాలని ఎంపీడీవో శ్రీ రామచందర్రావు అన్నారు. ఇట్టి కార్యక్రమంలో మూడు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు