06-06-2025 11:08:59 PM
హుజూర్ నగర్: జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హుజూర్నగర్ పట్టణంలోని 3వ వార్డు అధ్యక్షుడిగా వట్టికూటి శ్రీనివాస్ గౌడ్(Vattikuti Srinivas Goud)కు శుక్రవారం పట్టణంలోని బీసీ భవన్(BC Bhavan)లో నియామక పత్రం అందిస్తున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం(National BC Welfare Association) హుజూర్నగర్ నియోజకవర్గ అధ్యక్షులు ధూళిపాల శ్రీనివాసరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎత్తివేయాలని 10 శాతం ఉన్న ఓసీలలో ఆర్థికంగా వెనుకబడిన వారు ఐదు శాతం మాత్రమే ఉంటారు.
ఐదు శాతం ఉన్నవారికి 10 శాతం రిజర్వేషన్, 56% ఉన్న బీసీలకు 27% రిజర్వేషన్ ఇవ్వటం వల్ల బీసీలు త్రీవంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది అన్నారు. బీసీలకు జరుగుతున్న నష్టాన్ని వివరిస్తూ బీసీ వర్గాలను క్షేత్రస్థాయిలో చైతన్య పరచవలసిన బాధ్యత బీసీ నాయకత్వంపై ఉందన్నారు. అందులో భాగంగానే వార్డుల వారిగా కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం హుజూర్నగర్ పట్టణ అధ్యక్షులు బొడ్డు గోవిందరావు, మండల అధ్యక్షులు గడ్డం అంజి యాదవ్, పట్టణ ప్రధాన కార్యదర్శి రాయల వెంకటేశ్వర్లు, గంజి శివ తదితరులు పాల్గొన్నారు.