calender_icon.png 30 June, 2025 | 9:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరస్పర సహకారంతోనే ప్రగతి సాధ్యం

30-06-2025 02:14:52 AM

సత్యసాయి పరస్పర సహాయక సహకార పొదుపు సంఘం రజతోత్సవంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

రాజేంద్రనగర్, జూన్ 29: పరస్పర సహకారంతోనే ప్రగతి సాధ్యం అని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. మైలార్ దేవుపల్లి డివిజన్ లోని మార్కండేయనగర్లోని సత్యసాయి పరస్పర సహాయక సహాకార పొదుపు సంఘం లిమిటెడ్ పాలక మండలి సంకల్పించిన ఫంక్షన్ హాల్ నిర్మాణానికి తనవంతు పూర్తి సహకారం అదిస్తానన్నారు. ఆదివారం శివరాపల్లి ప్రజాభవన్లో సత్యసాయి పొందుపు సంఘం అధ్యక్షుడు పగిడిమర్రి సూర్యనారాయణ అధ్యక్షతన జరిగిన సంఘం రజతోత్సవ మహా సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈసందర్భంగా 25 ఏళ్ల క్రితం స్థాపించిన సత్యసాయి పొదుపు సంఘం నెలకు రూ.30 పొదుపుతో ప్రారంభమై 664 మంది సభ్యులకు సేవలందిస్తూ 5 కోట్ల టర్నోవర్తో అభివృద్ధి పథంలో కొనసాగడం సంతోషకరంగా ఉందన్నారు. ఈసందర్భంగా సంఘ వ్యవస్థాపక కార్యదర్శి, సలహాదారుడు గద్దె యాదగిరి, సలహాదారులు ఏర్వ సత్యనారాయణ, గద్దె క్రిష్ణ, పగిడిమర్రి వాసు,

సంఘం ఉపాధ్యక్షుడు మునగపాటి విష్ణు, ప్రధానకార్యదర్శి కోట శ్యామ్ కుమార్, సహాయ కార్యదర్శి కర్నాటి శ్రీనివాస్, కోశాధికారి కోటపవన్ కుమార్, పాలక మండలి సభ్యులు కంది అశోక్, కైరంకొండ శంకర్, విడెం రమేష్, శిరందాసు నరేందర్, గంజి నరేష్, గంజి ధనంజయ్, బాత్కు విజయ్ కుమార్, బూసం భాను చందర్ తదితరులను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఘనంగా సన్మానించారు. కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మార్కండేయనగర్ కాలనీ చిన్నదే అయినా సత్యసాయి పొదుపు సంఘం అభివృద్ధిలో ధీటుగా కొనసాగుతుండడం అభినందనీయమన్నారు. 

సంఘం ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన ఫంక్షన్హాల్ నిర్మాణానికి తన సహకరిస్తానన్నారు. అనంతరం సంఘం చార్డెట్ ఆడిటర్ వెంకటేష్, మేనేజర్ బొల్ల లక్ష్మీ నారాయణ, అకౌంటెంట్లు పాటు దివంగత సంఘ వ్యవస్థాపక, పాలక మండలి సభ్యుల జ్ఞాపకార్థం మెమెంటోలు అందజేశారు. అకౌంటెంట్ వేదవ్యాస్, ఆడిటర్ జయసింహారెడ్డి, ఇంటర్నల్ శ్రీరామ్ రాజు, మార్కండేయపాల్గొన్నారు