30-06-2025 02:13:19 AM
అబ్దుల్లాపూర్మెట్, జూన్ 29: రాజ్యాధికారం మన ఆలోచన సాధన సమితి (మాస్)తోనే సాధ్యమవుతుందని రాష్ట్ర అధ్యక్షులు కటకం నర్సింగ్ రావు అన్నారు. ఆదివారం మన ఆలోచన సాధన సమితి(మాస్) అధికార ప్రతినిధి ఆవుల వెంకట్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు కటకం నర్సింగ్ రావు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పెద్దవూర బ్రహ్మయ్యలు హాజరై మాట్లాడుతూ..
రాజ్యాధికారం మన ఆలోచన సాధన సమితి (మాస్)తోనే సాధ్యమవుతుందన్నారు. బీసీలను చైతన్య పరుస్తూ.. గ్రామాల్లో, మండలాల్లో తిరుగుతూ బీసీలతో మమేకమవుతూ.. సలహాలు, సూచనలు తీసుకుంటూ ముందుకెళ్తున్నామని తెలిపారు. ఏ కులమైనా సరే.. మేము బీసీలం అని చెప్పే విధంగా (మాస్) బీసీల్లో చైతన్యం తీసుకోస్తుందన్నారు. అలాగే బీసీ హాస్టల్లో సరైన వసతులు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో బాత్రూమ్స్, ఫ్రీ వాటర్, టేబుల్స్ చైర్స్ తదితర మౌలిక సదుపాయాలు లేకపోవడంతోనే.. ప్రైవేట్ పాఠశాలలకు పంపించడంతో ప్రైవేట్ పాఠశాలల మేనేజ్ మెంట్స్ అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధిక ఫీజులను నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయ న్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి ఆవుల వెంకట్ యాదవ్, ప్రొఫెసర్స్ డాక్టర్ మురళి, డాక్టర్ శ్రీధర్ రామ్మూర్తి, డాక్టర్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున గౌడ్, కోశాధికారులు దశరథ సాగర్ రవి, కస్తూరి అశోక్ తదితరులుపాల్గొన్నారు.