23-06-2025 01:48:17 AM
ఐఎన్టియూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొగుళ్ళ రాజిరెడ్డి
ముషీరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రో వాటర్ వరక్స్ & సేవరజ్ బోర్డులో ఐఎన్టియూసీ కాంగారు యూనియన్ సుదీర్ఘ పోరాటాల వల్లే ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తున్నాయని ఐఎన్టియూసీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, హెచ్ఏండబ్ల్యూడబ్ల్యూ అండ్ ఎస్బీ కాంగారు యూనియన్ అధ్యక్షులు మొగుళ్ళ రాజిరెడ్డి అన్నారు.
పెండింగ్ లోఉన్న ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతూ మొగుళ్ళ రాజిరెడ్డితో పాటు యూనియన్ ప్రధాన కార్యదర్శి సి. హెచ్. సురేష్ బాబు, అసోసియేట్ ప్రెసిడెంట్ బి. భూమయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ కె. రామరాజు, నేతలు ఆర్. సీత్య రఘునాథ్, నరేందర్, ప్రసాద్, గణేష్, జంగా రెడ్డి తదితరులు హైదరాబాద్ ఖైరతాబాద్ లోని హెచ్ఏండబ్ల్యూడబ్ల్యూ అండ్ ఎస్.బి ప్రధాన కార్యాలయంలో చీఫ్ జనరల్ మేనేజర్, వినోద్ భార్గవ ను కలసి వినతి పత్రం అందజేసినట్లు వెల్లడించారు.
టెక్నీషియన్ గ్రేడ్ -2 (ఎలక్ట్రికల్ బ్రాంచ్ ), టీజీ.-2 నుంచి జేటీఓ ప్రమోషన్ లు పొంది, ఖాళీఐన (17) టి. జి.-2 సివిల్ బ్రాంచ్ పోస్టు లు కూడా, అర్హులైన ఉద్యోగులకు ప్రమోషన్ కల్పించాలని, సేవరేజ్ బ్రాంచిలో 30/ 40 సంవత్సరాల నుండి ప్రమోషన్ లేక రిటైర్మెంట్ అవుతున్నటివంటి ఉద్యోగులకు రిటై ర్మెంట్ ముందు ప్రమోషన్ కల్పించాలని కో రారు.
వచ్చే వారంలో ప్రమోషన్ ఆర్డర్స్ రిలీజ్ చేస్తానని చీఫ్ జనరల్ మేనేజర్, వినో ద్ భార్గవ హామీ ఇచ్చారని గత 10 సంవత్సరాలు నుండి పెండింగ్లో ఉన్న (7) క్యూ. ఏటి.పోస్టులు, ప్రభుత్వంతో చర్చించి, అప్గ్రే డ్ చేయించి 20 రోజుల క్రితం రిటైర్మెంట్ ఐన క్యూఏటి వింగ్ ఉద్యోగి వెంకట సుబ్బ య్య జెటీఓకి ఏటీఓ (క్యూఏటీ)గా రిటైర్మెంట్ రోజున ప్రమోషన్ ఆర్డర్స్ ఇప్పించ డం కాం గారు యూనియన్ ఘానత అని అయన అన్నారు.
అనేక సంవత్సరాలుగా పెండింగ్ లోఉన్న జలమండలి ఉద్యోగుల సమస్యల పరిష్కరానికి సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, జలమండలి ఎండి అశోక్ రెడ్డికి మొగుళ్ల రాజిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.