17-06-2025 12:00:00 AM
ఎమ్మెల్యే రామారావు పటేల్
భైంసా, జూన్16(విజయక్రాంతి): బాసర గోదావరి వద్ద భక్తులకు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు వెంటనే చేపట్టాలని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అధికారులను ఆదేశించారు.
సోమవారం బాసర గోదావరి సందర్శించిన ఆయ న ఐదుగురు యువకులు మృతి చెందిన ప్రదేశాన్ని పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు సలహాలు అందించారు. ఇంతకంచలు ఏర్పాటు చేయాలని పోలీస్ గస్తీని పెంచాలని, భక్తులకు సూచనలు సలహాలు అందించాలని, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ కోమల్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు