calender_icon.png 17 June, 2025 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి సేవించి విక్రయిస్తున్న యువకులు అరెస్ట్

16-06-2025 11:37:06 PM

కోదాడ: గంజాయి విక్రయిస్తూ, సేవిస్తున్న నలుగురు యువకులను అనంతగిరి పోలీసులు(Ananthagiri Police) అరెస్టు చేసైనా ఘటన సోమవారం జరిగింది. కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అనంతగిరి గ్రామ శివారులో గల చాకలి గట్టు వద్ద నలుగురు వ్యక్తులు గంజాయి తీసుకుంటున్నారు అనే నమ్మదగిన సమాచారం మేరకు ఎస్పై సిబ్బందితో వెళ్లి తనిఖీలు చేశారన్నారు. దీంతో అనంతగిరి మండలం ఖానాపురం గ్రామానికి చెందిన కనగాల సతీష్ నుండి ఒక కేజీ, అనంతగిరి గ్రామానికి చెందిన షేక్ సైదాబాబు నుండి 300 గ్రాముల, నడిగూడెం మండలం (ప్రస్తుతం అనంతగిరి) చెందిన బడేటి వెంకటేష్ నుండి 300 గ్రాములు, అనంతగిరి గ్రామానికి చెందిన చెవుల శ్రీకాంత్ వద్ద నుండి 300 గ్రాముల గంజా లభించినట్లు తెలిపారు.

వీరు ఈ గంజాయిని కొంతమేర సేవించి మిగిలినది  విక్రయిస్తుండగా పట్టుకున్నారన్నారు. వీరి నుండి మూడు సెల్ ఫోన్ లను  స్వాధీనం చేసుకునీ  కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కేసుతో సంబంధం ఉన్న భానుప్రకాశ్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడన్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.47,500 ఉంటుందని తెలిపారు. ఈ స్పెషల్ టాస్క్ లో కోదాడ రూరల్ సీఐ జి. రజితా రెడ్డి సారధ్యంలో ఎస్సై నవీన్ కుమార్,  కానిస్టేబుల్ నిరంజన్, సతీష్, శ్రీను నరసింహ లు పాల్గొన్నారన్నారు.

కోదాడ పట్టణంలో..

పట్టణ శివారు దుర్గాపురం క్రాస్ రోడ్డులో గంజాయి సేవిస్తున్న, విక్రయిస్తున్న షేక్ అలీం, మాలోతు సాయి కుమార్, తమలపాకుల సిద్ధులను అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ శివశంకర్ తెలిపారు. వీరి వద్ద నుంచి అరకేజీ గంజాయి, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బీహార్ రాష్ర్టానికి చెందిన సందీప్ పరారీలో ఉన్నట్లు వివరించారు.