24-06-2025 11:45:55 PM
నిర్మల్ (విజయక్రాంతి): ఇజ్రాయిల్ ఇరాన్ దేశాలపై అమెరికా జరుగుతున్న వైమానిక దాడులను నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం నిర్మల్(Nirmal)లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి ఆర్డిఓ కార్యాలయం వద్ద జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. అమెరికా దేశం దాడులు నిర్మించడం వల్ల ప్రపంచంలో తీవ్ర పరిణామాలు ఏర్పడి ప్రజలు ఇబ్బంది గురవుతారని పెట్రోల్ బంకులను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా ఇటువంటి దాడులకు పాల్పడుతుందని నేతలు ఆరోపించారు. దాడులను వెంటనే ఆపాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్షాల నాయకులు రాజన్న పోశెట్టి మైమూద్ ఎస్ఎన్ రెడ్డి విలాస్ ముఖ్య రమేష్ రామ్ లక్ష్మణ్ గంగన్న తదితరులు పాల్గొన్నారు.