25-06-2025 12:00:00 AM
ఆపరేషన్ సింధు ద్వారా స్వదేశానికి
హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): ఇరాన్, ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధు పేరుతో స్వదేశానికి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 24న తెలంగాణకు చెందిన మరో 17 మంది విద్యార్థులు వివిధ దేశాల నుంచి మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు.
వచ్చిన వారిలో ఇరాన్ నుంచి ఐదుగురు, జోర్డాన్ నుంచి ఒకరు, ఇజ్రాయెల్ నుంచి 11 మంది ఉన్నారు. ఢిల్లీలో తెలంగాణ భవన్లో విద్యార్థుల కోసం ఇప్పటికే హెల్ప్ డెస్క్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.