24-06-2025 11:49:08 PM
మంచిర్యాల (విజయక్రాంతి): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని సాయికుంట బస్తీ దవాఖాన వద్ద మంగళవారం టీబీ ముక్త్ భారత్ అభియాన్(TB Mukt Bharat Abhiyan) సమగ్ర ఆరోగ్య పరీక్షల శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో క్షయ వ్యాధి, హెచ్ఐవి ఎయిడ్స్, మధుమేహం, రక్తపోటు హెపటైటిస్ తదితర వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేసి అవసరమైన వారికి చికిత్సలు అందించారు. 45 మందిని అనుమానించి ఎక్స్ రే కోసం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ శిబిరంలో వైద్యులు డాక్టర్ అమన్, డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ రామకృష్ణ, సి హెచ్ ఓ లు వెంకటేశ్వర్లు, రామ్మూర్తి, హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్, సబ్ యూనిట్ అధికారి నాందేవ్, హెపటైటిస్ వ్యాధి పర్యవేక్షకులు మధు, సి ఓ అపర్ణ, టి బి హెచ్ వి స్వప్న, మొబైల్ ఐ సి టి సి కౌన్సిలర్ శ్రీలత, ల్యాబ్ టెక్నీషియన్ లు తదితరులు పాల్గొన్నారు.