21 March, 2026 | 2:03 AM

బాసర త్రిఫుల్ ఐటీ ఎదుట నిరసన

21-03-2026 12:27 AM

భైంసా, మార్చి 20 (విజయక్రాంతి):  బాసర త్రిఫుల్ ఐటీ  విద్యార్థుల 12 డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శుక్రవారం బాసర త్రిఫుల్ ఐటీ ఎదుట నిరసన తెలిపారు. ఇటీవలే విద్యార్థి మృతికి కారణమైన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రాచకొండ విగ్నేష్, దిగంబర్ తెలిపారు.

విద్యార్థులు డిమాండ్ చేసిన 12 సమస్యలను పరిష్కరించాలని త్రిఫుల్ ఐటీ బాసర మెయిన్ గేట్ ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూనివర్సిటీల కో కన్వీనర్ చక్రి, అక్షయ్, సాంకేత్ పాల్గొన్నారు.