17-02-2026 07:38:19 PM
ముకరంపుర,(విజయక్రాంతి): 19వ నుంచి పవిత్రమైన రమజాన్ మాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో నగరంలోని అన్ని మస్జిదుల వద్ద, ముస్లిం కాలనీల్లో అధికారులు చేయాల్సినటువంటి ఏర్పాట్లపై కరీంనగర్ ఎంఐఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ కోరారు.
ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ కు, జిల్లా సీపీకి, నగరపాలక సంస్థ కమిషనర్ కు, జిల్లా ట్రాన్స్కో ఎన్పీడీసీఎల్ ఎస్ఈలకు వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, జాయింట్ సెక్రటరీలు హాఫీజ్ యూసుఫ్, ఆతిన, కోశాధికారి ఇబ్రహీం, కార్పొరేటర్లు మొహసీన్ మొహియుద్దీన్, మాజిద్ హుస్సేన్, నాయకులు బాబుజానీ, అరిఫ్ అహ్మద్, తాజుద్దీన్, షబ్బీర్, శ్రీనివాస్, రాజు, సురేశ్, సుధాకర్, అక్బర్, వాజిద్ అలీఖాన్, తదితరులు పాల్గొన్నారు.