calender_icon.png 20 June, 2025 | 2:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లు అమలయ్యాకే ‘స్థానికం’

18-06-2025 12:36:02 AM

  1. లేదంటే ఎన్నికలను అడ్డుకుంటాం

రిజర్వేషన్ల సాధనకై పరేడ్ గ్రౌండ్‌లో లక్షమందితో సభ 

 రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ నేతలు 

ఖైరతాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ నేతలు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌కు అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవ మద్దతు ప్రకటించాలని కోరారు. లేనిప క్షంలో స్థానిక సంస్థలను అడ్డుకుంటామని హెచ్చరించారు.

బీసీ రిజర్వేషన్ల సాధనకై త్వరలోనే లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ సంక్షే మ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్ల పెంపు భవిష్యత్ కార్యాచరణపై బీసీ సంఘాల, బీసీ మేధావుల అత్యవసర రౌండ్ టేబుల్ సమావే శాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ బిల్లు చేసి చేతు లు దులుపుకోకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఇందుకోసం  బీసీలంతా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని చెప్పారు. బీసీ బిల్లు ఆమోదం పొందేలా కృషి చేయవలసిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల గ్రామాలు అస్తవ్యస్తమ య్యాయ ని, వెంటనే ఎన్నికలు ప్రకటించాలని డిమాం డ్ చేయడాన్ని తప్పు పట్టారు. 42శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు జరపడం సరికాదని అన్నారు.

ముఖ్యమంత్రి ఎవరి మాట వినకుండా తక్షణమే ప్రధానమంత్రి సమయం కోరి అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. బీసీల ఓట్లతో గెలిచి బీసీల ప్రయోజనాలకు పాటుపడని రాజకీయ పార్టీలను, నాయకులను వచ్చే ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై వెనక్కు తగ్గే ప్రసక్తి లేదని, రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలని లేదంటే అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు.

రెండు రోజుల్లోనే బీసీ సంఘాలు మేధావులు, న్యాయ నిపుణులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. శాసనసభ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి మాట్లాడుతూ.. ఏ పార్టీ అయినా బీసీలకు అన్యాయం చేయాలని తలపెడితే కచ్చితంగా బీసీలంతా పార్టీలకతీతంగా పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం కావాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో భాగంగా ముఖ్యమంత్రి ఢిల్లీకి అఖిలపక్షంతో వెళితే అందులో బీఆర్‌ఎస్ పార్టీ కచ్చితంగా పాల్గొంటుందని స్పష్టం చేశారు. బీసీ ఇంటలెక్వల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభు త్వం 9వ షెడ్యూల్ బీసీ రిజర్వేషన్ల బిల్లును చేర్చి బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని కోరారు.

ఈ సమావేశంలో బీసీ కుల సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ బాలగోని బాలరాజుగౌడ్, మహాత్మ జ్యోతిబాపూలే జయంతి నిర్వహణ కమిటీ చైర్మన్ చిన్న శ్రీశైలంయాదవ్, బీసీ నేతలు ఉప్పరి శేఖర్ సగర, దీటి మల్లయ్య, ప్రొఫెసర్ నరేందర్, సీనియర్ జర్నలిస్ట్ అశోక్ కుమార్, కోలా జనార్ధన్, దాసోజు లలిత, బి మని మంజరి, గొడుగు మహేష్ యాదవ్, జాజుల లింగం గౌడ్, కిరణ్ కుమార్, కవుల జగన్నాథం, కోల శ్రీనివాస్, ఎకట్టే విజయ్ కుమార్ గౌడ్, సమతా యాదవ్, సంధ్య, గౌతమి, హరినాథ్, వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు.