28-09-2025 07:30:32 PM
నిర్మల్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించడం ఒక చారిత్రాత్మక విజయమని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పొన్నం నారాయణ గౌడ్ ఆదివారం పలిపారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య సుదీర్ఘ పోరాట కృషి, అలాగే బీసీ సంఘాల దీర్ఘకాలిక ఉద్యమ ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ రిజర్వేషన్లు రాజ్యాంగ, చట్ట, న్యాయ బద్ధమైనవని అందువల్ల అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా రిజర్వేషన్లను వ్యతిరేకించే వర్గాలు కూడా ప్రజాస్వామ్యస్ఫూర్తిగా గౌరవించి, ఈ నిర్ణయానికి మద్దతు ఇవ్వాలని మనవి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అత్యధిక సీట్లు దక్కడంతో బీసీలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు.