28-09-2025 07:34:08 PM
నిర్మల్ (విజయక్రాంతి): ఉమ్మడి అదిలాబాద్ జిల్లా సాహితివేత్త సంస్కృత భాషా ప్రచార సమితి వ్యవస్థాపకులు బి వెంకట్ కు ఆదివారం సాహితీ కిరీటి అవార్డులు అందుకున్నారు. తెలంగాణ సాహిత్య రంగానికి ఆయన చేస్తున్న కృషికి గాను సాహితిరంగ సంస్థ ఆధ్వర్యంలో నిర్వాహకులు ఈయనకు అవార్డు ప్రకటించి హైదరాబాదులో ఈ అవార్డు అందించినట్లు ఆయన తెలిపారు. అవార్డు అందుకున్న బి వెంకట్ కు నిర్మల్ కవులు కళాకారులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.