ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా సంఘాలతో సమావేశం
09-03-2026 12:32 AM
గాంధారి, మార్చ్ 8 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో గ్రామ మహిళ సంఘం కార్యాలయంలో జడ్పీ సీఈవో చందర్ నాయక్ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో చేపట్టబోయే కార్యక్రమాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈవో చందర్ నాయక్ మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు బ్యాంకు , స్త్రీ నిధి రుణాలు పెండింగ్ లేకుండా చూసుకోవాలని సూచించారు. మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకొని ఆర్థికంగా వృద్ధి చెందాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజేశ్వర్, ఎంపీఓ లక్ష్మీ నారాయణ, సీసీ గొర్రె రాములు, విఓఎ లక్ష్మీ ప్రియ మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.




