calender_icon.png 25 June, 2025 | 3:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

25-06-2025 01:16:52 AM

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రామచంద్రు నాయక్

తుంగతుర్తి, జూన్ 24 : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీమంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించి అనంతరం పిసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తామని అన్నారు. ప్రజా పాలనలో మహిళలు, రైతులు, రైతు కూలీలు, నిరుద్యోగులు పేదలకు సబండ వర్గాలకు మేలు జరుగుతుందని అన్నారు.ఈ స్థాయిలో ఏ ప్రభుత్వం దేశంలో ప్రజలకు మేలు చేయలేదన్నారు. పది సంవత్సరాలు పరిపాలించిన నాటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని ఎద్దేవ చేశారు.

నేడు రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తుందని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరోసారి ఇందిరమ్మ పథకం ప్రారంభించి ప్రతి నిరుపేదకు నిర్మించి ఇస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం తద్యమని అన్నారు.

ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ కొండ రాజు, పెద్ద బోయిన అజయ్, గౌతమ్ రెడ్డి, మాచర్ల అనిల్,మహిళ కమిటీ అధ్యక్షురాలు పులి సత్తమ్మ, మారగాని వెంకటయ్య, నారాయణదాసు వెంకన్న, హేమ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.