calender_icon.png 25 June, 2025 | 3:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ మద్యం సిండికేట్‌పై చర్యలు తీసుకోవాలి: బీజేపీ డిమాండ్

25-06-2025 01:17:13 AM

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 24 (విజయక్రాంతి); పాల్వంచ పట్టణంలో అక్రమ మద్యం సిండికేట్ల పై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పోని శెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మంగళవారంబీజేపీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎక్సైజ్ కార్యాలయం లో అక్రమ మద్యం వ్యాపారం, బెల్టు షాపుల పెరుగుదల, మద్యం సిండికేట్ కార్యక లాపాలు, వైన్ షాప్లలో నిబంధనల ఉల్లంఘనలు వంటి అనేక అంశాలపై ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాల్వంచ పట్టణం, మండల పరిధిలో ప్రభుత్వ అనుమతితో కేవలం 13 మద్యం షాపులు మాత్రమే ఉన్నాయి. కానీ అనధికారికంగా సుమారు 1000కు పైగా బెల్టు షాపులు నడుస్తున్నాయి.

వీటికి మద్యం సరఫరా చేయడానికి పాల్వంచలో అనధికారికంగా ఒక మద్యం సిండికేట్ కార్యాలయం పనిచేస్తోంది. ప్రభుత్వ షాపులకు వచ్చే మద్యంను ఈ సిండికేట్ సగ భాగంగా తమ వద్దకు తరలించి, బెల్టు షాపులకు అధిక ధరలకు సరఫరా చేస్తున్నారనీ ఆరోపించారు. ప్రభుత్వం నుండి వచ్చే మద్యం లో కొన్ని మద్యం బ్రాండ్ లు వైన్ షాప్ లో పెట్టకుండా కేవలం బెల్టు షాప్ లకు సరఫరా చేస్తున్నారన్నారు. బెల్టు షాపుల్లో ఈ మద్యం కల్తీ చేయబడుతోందని, ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాల్వంచలోని కొన్ని బార్ షాపులు పగలు-రాత్రి తేడా లేకుండా మద్యం విక్రయిస్తున్నట్లు, వైన్ షాప్లలో అనధికారికంగా సిట్టింగ్ ఏర్పాటు చేసి అర్ధరాత్రి దాకా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ షాపుల్లో ప్రభుత్వ ధరలకు మించి మద్యం విక్రయాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.

బీజేపీ పార్టీ ప్రధాన డిమాండ్లు ఇవే:1.పాల్వంచలోని అనధికారిక మద్యం సిండికేట్ కార్యాలయాన్ని తక్షణమే మూసివేయాలి.2.కల్తీ మద్యం ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించా లి.3.బెల్టు షాపులకు మద్యం సరఫరా చేసే అక్రమ మద్యం సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.4.అన్ని బెల్టు షాపులను మూసివేసే చర్యలు చేపట్టాలి.అధికారులు వెంటనే స్పందించ కపోతే, బీజేపీ పార్టీ ప్రజలను సంఘటితం చేసి ప్రత్యక్ష ఉద్యమాన్ని చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో బత్తుల వెంకటేశ్వర్లు,మాదారపు లక్ష్మణ్,గుండు రాజు,పరిమి శ్రీనివాస్ నా యుడు,శంపురి పవన్,భట్టు అశోక్,సింగారపు సాగర్,వరక సత్యం,బానోత్ మంగీలాల్, నందిగం వెంకటరమణ,కొంగ ఉమా,బయ్యా కవిత,సోడె వెంకటరమణ, లు పాల్గొన్నారు.