19 March, 2026 | 3:24 AM

రాహుల్‌ గాంధీకి పుణె కోర్టు సమన్లు

27-04-2025 12:25 AM

ముంబై, ఏప్రిల్ 26: సావర్కర్‌ని ‘బ్రిటీషర్ల సేవకుడు’ అని ఇటీవల ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ లండన్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై పుణె కోర్టు సమన్లు జారీ చేసింది. రాహుల్‌వ్యాఖ్యలపై సావర్కర్ మనవడు సత్యకి పుణె కోర్టును ఆశ్రయించి, పరువు నష్టం దావా వేశాడు. ఈ కేసులోనే కోర్టు సమన్లు జారీ చేస్తూ, వచ్చే నెల 9న విచారణకు హాజరు కావాలని సూచించింది.